Thursday, May 2, 2024

Purandeshwari: ఎన్టీఆర్ వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనం.. ఎన్టీఆర్ కు ఘన నివాళి

నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని ఒక ప్రభంజనమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం అనే పదానికి మారుపేరు ఎన్టీఆర్.. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారని పురందేశ్వరి గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement