Saturday, May 4, 2024

ట్రావెల్స్ బస్సు బోల్తా… పలువురికి గాయాలు

.ఎన్టీఆర్ జిల్లా లోని జగ్గయ్యపేట పరిధిలో ఉన్నతోటచర్ల మునగచర్ల మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద మయూరి ట్రావెల్స్ బస్సు (AP39 TC 4248) బోల్తా కొట్టింది. జాతీయ రహదారి పక్కన ఉన్న కందకంలో పల్టీ కొట్టిన బస్సు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

హైదరాబాదు నుండి విజయనగరం వెళ్తున్న బస్సు అతి వేగంకారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన 10 మంది ప్రయాణికులకు గాయాలు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు , జి ఎం ఆర్ ,108 సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement