Thursday, May 2, 2024

అకాల వర్షం… మొక్కజొన్న పంటల నష్టం

గంపలగూడెం: కృష్ణా జిల్లా గంప‌ల‌గూడం మండ‌లంలో బుధవారం రాత్రి సంభవించిన అకాల వర్షం రైతన్నకు అపార నష్టాన్ని కలిగించింది. మండల పరిధిలోని ఊటుకూరు, గాదెవారిగూడెం,కొణిజర్ల తదితర గ్రామాల్లో ఈ అకాల‌వ‌ర్షం కార‌ణంగా మొక్కజొన్న పంటలకు న‌ష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో అనేక ఎక‌రాల్లో పంట నెలకొరిగింది. చేతికి వచ్చిన ఎర్ర మిరప కల్లాలలో ఆరబెట్టుకోగా తడిసిపోయింది. కొంత మంది రైతులు ఎర్ర మిర్చిపై టార్పాలిన్లు వేసి కాపాడుకున్నా అధిక వర్షం నమోదు కావటంతో కల్లంలో పారిన నీళ్లు మిర్చిని తడిసి ముద్ద చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement