Saturday, May 18, 2024

మందుల పంపిణీకి శ్రీకారం..

కందుకూరు : కందుకూరు నియోజకవర్గంలో 7 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మదుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి శ్రీకారం చేశారు. ఏడాది క్రితం కరోనా మహమ్మారి చెలరేగిన నేపధ్యంలో అవసరమైన సహాయ చర్యల కోసం విరాళాలు అందించాలని ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు చక్కని స్పందన వచ్చి అతి స్వల్ప వ్యవధిలోనే ఒకటిన్నర కోటి నిధులు సమకూరాయి. నిధులను పారదర్శకంగా వినియోగించడం కోసం ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. కమిటీ సూచనల మేరకు ప్రజలు ప్రశంసించేరీతిగా నిధులను సద్వినియోగం చేయడం జరిగింది. అందులో ఇంకా కొంత నిధి మిగిలి ఉండటంతో నియోజకవర్గంలోని 7 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కొన్ని మందులను పంపిణీచేయడానికి ఆ నిధులను వినియోగించాలని నిర్ణయం జరిగింది. ప్రభుత్వం నుండి సరఫరాలో జాప్యం జరుగుతున్న అత్యవసర మదులను కొనుగోలు చేసి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను పంపిణీచేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement