Thursday, May 2, 2024

పార్టీ ఏదైనా పనిచేసేవారికే గుర్తింపు..

యర్రగొండపాలెం: పార్టీ ఏదైనా సరే ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేసేవారికే గుర్తింపు లభిస్తుందని గంజివారిపల్లి సర్పంచ్‌ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి తెలిపారు. పంచాయితీ ఎన్నికలలో గెలిచిన అనంతరం తనదైన శైలిలో ప్రతీ రోజు ఓ కార్యక్రమం నిర్వహిస్తూ గెలిచిన అనంతరం కూడా ప్రజలను మరువని సర్పంచ్‌ అనిపించుకుంటున్నారు. ఈ సంధర్భంగా గంజివారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో, హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల భోజనం సమయంలో తనిఖీ చేసి వారితో పాటు భోజనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వార్డుమెంబర్‌ వెన్నా వెంకట సుబ్బారెడ్డి, గట్ల హనిమిరెడ్డి, డి. బసవారెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement