Tuesday, April 30, 2024

ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్

ఉలవపాడు : ఉలవపాడు మండలంలో ప్రతి ఒక్కరూ కోవిడ్‌-19 వ్యాక్సిన్ ను వేయించుకోవాలని ఎంపిడిఓ రవికుమార్‌ ప్రజలను కోరారు. ఉలవపాడు, కరేడు, చాకిచర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వాక్సిన్‌ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారితోపాటు గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అన్నీ శాఖల అధికారులు కూడా ఈ వాక్సిన్‌ను వేయించుకోవాలని ఆయన కోరారు. దీనిపై కరేడు గ్రామంలో ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం కరేడు సచివాలయాన్ని ఆయన తనిఖీచేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిర్ణీత సమయంలో ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది సచివాలయానికి రావాలని ఆయన సచివాలయ సిబ్బందిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పధకాలను ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరేడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ కె.శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement