Friday, May 3, 2024

నందికొట్కూరు నియోజకవర్గంలో 5మంది జ‌డ్పీటీసీల‌కు స్టాండింగ్ కమిటీలో పదవులు

నందికొట్కూరు, (ప్రభ న్యూస్) : కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న జ‌డ్పీటీసీల‌కు కర్నూలులో జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆశీస్సులతో 5మందిలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నలుగురికి, ఒకరికి చైర్మన్ గా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘాల సభ్యులను ఎన్నుకున్నారు.
స్టాండింగ్ సభ్యుల వివరాలను జ‌డ్పీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి వెల్లడించారు.

జిల్లా స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘాల్లో నందికొట్కూరు నియోజకవర్గ స్థాయిలో మిడుతూరు జడ్పీటీసీ పర్వత యుగంధర్ రెడ్డికి ఆర్థిక కార్యకలాపాలు, ప్రణాళిక సభ్యులుగా, ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి హామీ పథకం సభ్యులుగా కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యులు సోమల సుధాకర్ రెడ్డి, నందికొట్కూరు జడ్పీటీసీ షైక్ కరిమున్నీసా సోషల్ వెల్ఫేర్ సభ్యులుగా, జూపాడుబంగ్లా మండలం జడ్పీటీసీ పోచా జగదీశ్వర్ రెడ్డిని అభివృద్ధి పనుల సభ్యులుగా, పగిడ్యాల జడ్పీటీసీ పుల్యాల దివ్య జిల్లా మహిళా సంక్షేమ అండ్ రక్షణ స్థాయి సంఘం చైర్మన్ గా ఎన్నికయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ… జిల్లా పరిషత్ స్టాండింగ్ స్థాయి సంఘాలలో నందికొట్కూరు నియోజకవర్గానికి పెద్దపీట వేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డికి, రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి యువసేన తరుపున సభ్యులకు నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్షపోగు ప్రశాంతి, కౌన్సిలర్లు చిన్న రాజు, చాంద్ బాష, లాల్ ప్రసాద్, అశోక్, రావుప్, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement