Thursday, April 25, 2024

అమెరికా రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ యువ‌కుడు మృతి..

తెలంగాణ యువ‌కుడు అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు..అమెరికాలోని ఎల్లికాట్ న‌గ‌రంలో రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో శేఖ‌ర్ అనే యువ‌కుడు మృతిచెందాడు. మృతుడు మండలి శేఖర్.. వయసు 28 సంవత్సరాలు. స్వస్థలం నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెం. గత రెండేళ్లుగా శేఖర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. శేఖర్ మరణవార్తను అమెరికా అధికారులు అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. కాగా, తమ కుమారుడి మృతదేహం అమెరికాలో ఉందని, భారత్ కు తీసుకువచ్చేందుకు సాయపడాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement