Thursday, April 25, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధు నామినేషన్

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం టిఆర్ఎస్ అభ్యర్థిగా తాత మధు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు, కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లెందు, వైరా, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, లావుడియా రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement