Friday, May 3, 2024

AP | 3న పాలిసెట్‌ స్పాట్‌ అడ్మిషన్లు.. మిగిలిన సీట్ల భ‌ర్తీకి చ‌ర్చ‌లు

అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగిలిన సీట్లను ఆక్టోబరు 3వ తేదీ నిర్వహించే స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు- సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌, ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆసక్తి కలిగిన విధ్యార్ధులు సెప్టెంబరు 30వ తేదీన అయా పాలి-టె-క్నిక్‌ కళాశాలల నుండి అందుబాటు-లో ఉన్న సీట్ల వివరాలను తెలుసుకోవచ్చన్నారు. సంబంధిత కళాశాల నోటీ-స్‌ బోర్డులో విభాగాల వారిగా ఖాళీ సీ ట్ల వివరాలను పొందుపరుస్తారని స్పష్టం చేసారు.

స్పాట్‌ అడ్మిషన్‌ పొందగోరు విద్యార్ధులు పదవతరగతి ఉత్తీర్ణులు అయి ఉంటే సరిపోతుందని, పాలిసెట్‌ ఎంట్రన్స్‌ రాయకపోయినా, రాసినప్పటికీ ర్యాంకు రాకపోయినా సీటు- పొందవచ్చన్నారు. అక్టోబరు 3వ తేదీనే అడ్మిషన్లకు సంబంధించిన మొత్తం ప్రక్రియ ముగుస్తుందని, ఆసక్తి ఉన్న అభ్యర్దులు తమ ఒరిజినల్‌ ధృవీకరణ ప్రతాలతో హాజరు కావాలని నాగరాణి తెలిపారు. ప్రవేటు- పాలి-టె-క్నిక్‌ లలో ప్రవేశాలకు రూ.25,000, ప్రభుత్వ పాలి-టె-క్నిక్‌ లలో రూ.4,700 ఫీజును సైతం అదే రోజు చెల్లించ వలసి ఉంటు-ందన్నారు.

- Advertisement -

ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇదే చివరి అవకాశమని పదవతరగతి ఉతీర్ణులైన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్‌ సూచించారు. స్పాట్‌ అడ్మిషన్‌ లో సీటు- పొందిన విధ్యార్ధులు తక్షణమే తరగతులకు హాజరు కావాలని ఉంటు-ందన్నారు. మరింత సమగ్ర సమాచారం కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు- కళాశాలల కార్యాలయాలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement