Thursday, May 2, 2024

వ్య‌భిచార గృహంపై పోలీసుల దాడి.. ఆ ప‌నిచేస్తున్న న‌లుగురు అరెస్టు

గుంటూరు క్రైo, (ప్ర‌భ న్యూస్‌): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సోమ‌వారం అర్ధ‌రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు వ్యక్తులను నల్లపాడు ఎస్సై కిష్ణారెడ్డి అరెస్ట్ చేసినట్లు నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు. ఏటీ అగ్రహారం చైతన్యనగర్ లోని ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసుల‌కు అందింది. దీంతో నగరంపాలెం ఎస్సై కృష్ణారెడ్డి తన సిబ్బందితో కలసి త‌నిఖీల‌కు వెళ్లారు. కాగా, ఆ ఇంటిలో వ్యభిచారం చేస్తున్నా ఇద్దరు ఆడవారిని, ఇద్దరు మగవారిని అరెస్ట్ చేసినట్లు సీఐ హైమారావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement