Saturday, May 4, 2024

Janasena : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసుల అనుమతి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించనున్న వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేదని కాకినాడ ఎస్పీ సతీష్ చెప్పారు. జనసేన నేతలతో డీఎస్పీలు టచ్ లో ఉన్నారని కాకినాడ ఎస్పీ సతీష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్యటన వారాహి యాత్ర నేపథ్యంలో భద్రత కోసం మినిట్ మినిట్ షెడ్యూల్ అడిగినట్టుగా ఎస్పీ వివరించారు. ఎవరైనా ఎక్కడైనా పర్యటించే హక్కుందన్నారు. పవన్ కళ్యాణ్ యాత్రను రేపు తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన నేతలు భావించారు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాకినాడ ఎస్పీ సతీష్ ప్రకటించడంతో జనసేన కార్యకర్తల్లో జోష్ వచ్చింది. తొలుత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. తొలుత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement