Saturday, May 4, 2024

విశాఖ‌లో ప‌వ‌న్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్యాలు – జ‌న‌సేన‌కు పోలీసుల నోటీస్ ..

విశాఖ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విశాఖ వారాహి విజ‌య యాత్ర స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేవిధంగా వ్యాఖ్యాలు చేశార‌నే అభియోగం పోలీసులు ఆ పార్టీకి నోటీసులు ఇచ్చారు.. ప‌వ‌న్ స‌భ‌కు 30 సెక్ష‌న్ కింద అనుమ‌తి తీసుకున్న జ‌న‌సేన పార్టీ కార్య‌ద‌ర్శి కోన తాతారావుకి పోలీసులు నోటీస్ లు అంద‌జేశారు.. సెక్ష‌న్ 30కి విరుద్దంగా ప‌వ‌న్ ప్ర‌సంగం ఉందంటూ ఆ నోటీస్ లో పేర్కొన్నారు..స‌భ‌లో ప్ర‌సంగించే స‌మ‌యంలో సంయ‌మంతో ఉండాల‌ని, రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌సంగాలు ఉండ‌రాద‌ని పోలీసుల అన్నారు.. ఇక‌పై అటువంటి ప్ర‌సంగం చేసిన‌ట్ల‌యితే అనుమ‌తి తీసుకున్న మీపైనా, ప్ర‌సంగించిన వారిపైన కూడా చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోతుంద‌ని హెచ్చ‌రించారు..

అలాగే కోన తాత‌రావుకు ఇచ్చిన నోటీస్ కాపీని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా పోలీసుల అంద‌జేశారు.. అందులో పోలీస్ నిబంధ‌న‌లు పాటిస్తూ, స‌భను నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు.. నిరాధార‌, రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేయ‌రాద‌ని కోరారు.. అలాగే శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే విధంగా ప్ర‌వ‌ర్తించ‌బోనంటూ త‌మ‌కు అఫిడ‌విట్ ఇవ్వాలని పోలీసులు ప‌వ‌న్ ను కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement