Tuesday, April 30, 2024

ఎర్ర చందనం అక్రమ రవాణా.. ముఠా అరెస్ట్

అంతర్జాతీయ ఎర్ర చందనం రవాణా ముఠాను హిందూపురం రూరల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠాలోని 19 మంది నిందితులను అరెస్టు చేశారు. 3,305 కిలోల బరువున్న 165 ఎర్రచందనం దుంగలు, 5 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.50 కోట్లు ఉంటుందని అంచనా. కడప, చిత్తూరు జిల్లాల నుండీ సేకరించి తమిళనాడులోని తిండివనం గోదాముల్లో నిల్వ చేయడం… అక్కడి నుండి శ్రీలంక మీదుగా సముద్ర మార్గానా చైనాకు అక్రమ రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ ముఠాలో ఉన్న ఇద్దరు కీలక నిందితులు విదేశాల్లో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement