Sunday, April 28, 2024

వీడు మామూలోడు కాదు.. మూడుసార్లు పెళ్లికి ప్లాన్‌, అడ్డుకున్న భార్య‌..

వీడు మామూలోడు కాదు.. మొద‌టి భార్య ఉండ‌గానే.. మ‌రొక‌రిని పెళ్లి చేసుకుంటూ వంచ‌న చేయాల‌నుకున్నాడు. ఇట్లా ఒక‌టి కాదు, రెండు కాదు.. మూడు సార్లు పెళ్లి చేసుకోవ‌డానికి ట్రై చేశాడు. తీరా తాళిక‌ట్టే టైమ్‌కు వ‌చ్చిన మొదాటి భార్య ఆ పెళ్లిళ్ల‌ల‌ను ఆపేస్తోంది. ఈ సారి కూడా సేమ్ టూ సేమ్ అట్లాగే జ‌రిగింది. భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘ‌ట‌న కృష్ణా జిల్లాలో జ‌రిగింది.

న‌ల్గొండ‌ జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన ర‌వ‌ళి (పేరు మార్చాం)తో నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. అత్తింటి వారి వరకట్న వేధింపుల కారణంగా 3 ఏళ్లుగా ర‌వ‌ళి పుట్టింట్లోనే ఉంటోంది. ఈవిషయమై భువనగిరి పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదయ్యింది. కేసు కోర్టు విచారణలో ఉంది. ఈనేపథ్యంలో మధుబాబు గతంలో రెండుసార్లు ర‌వ‌ళికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని చూసినా.. ఆమె వాటిని అడ్డుకుంది. తాజాగా ముడోసారి కూడా ర‌వ‌ళికి తెలియకుండా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈసారి మధుబాబు కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు ఆదివారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయానికి వచ్చాడు. ఆలయంలో పెద్ద తిరునాళ్లు జరుగుతుండ‌డంతో ఆలయం అంతా రద్దీగా ఉంది.

మధుబాబు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయితో పీటల మీద కూర్చుని ఉన్నాడు. ఈలోపు ర‌వ‌ళి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పెళ్లి కుమారుడిగా ఉన్న మధుబాబుపై దాడిచేసి వివాహాన్ని అడ్డుకుంది. గతంలో జరిగిన వివాహంతోపాటు మధుబాబు రెండు సార్లు పెళ్లి చేసుకోవాలని చేసిన ప్రయత్నాలను ఆడపెళ్లివారికి వివరించింది. దీంతో వారు మధుబాబు కుటుంబ సభ్యులపై ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ర‌వ‌ళి కుటుంబ సభ్యులు మధుబాబును స్ధానిక పోలీసు‌స్టేషన్‌కు తీసుకురాగా.. ఇప్పటికే భువనగిరిలో కేసు ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరంలేదని ఎస్సై చెప్ప‌డంతో వారు హైదారాబాద్ బయలు దేరి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement