Sunday, May 26, 2024

ఏపీలో ప్రజలకు రక్షణ కరువైంది.. చంద్రబాబు

ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్నిసార్లు చెప్పినా పోలీసు వ్యవస్థ మారడం లేదన్నారు. పోలీసు వ్యవస్థలో కళంకిత అధికారులు తయారయ్యారన్నారు. పరిటాల రవి హత్య తర్వాత సాక్షులను చంపేశారన్నారు. వైఎస్ వివేకా హత్య తర్వాత ఇద్దరు సాక్షులను చంపేశారన్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయం ఉందంటున్నారు. నేరస్థులను కట్టడి చేసేంతవరకు పోరాడుతామన్నారు. రాజధానులు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement