Monday, May 20, 2024

పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. ఆయనకు ఆప్షన్లే లేవన్న మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసమని ఆమె విమర్శించారు. ఈరోజు మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు ఆప్షన్లు లేవని.. ఓడిపోవడమేనని విమర్శించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేశారు. 2024లో కూడా అదే రిపీట్‌ అవుతుందన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమని విమర్శించారు.


టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీకి 50 స్థానాల్లో అభ్యర్థులు లేరని లోకేష్ చెప్పారన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పోటీ నామా మాత్రమేనన్నారు. బద్వేలులో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి రోజా ఆరోపించారు. ఏపీలో బీజేపీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో గౌతమ్ రెడ్డి మంచితనానికి.. సీఎం జగన్ మానవత్వానికి ఆత్మకూరు ప్రజలు ఓటు వేసే సమయమని అన్నారు. మేకపాటి కుటుంబంపై ప్రజలకు అభిమానం చాటిచెప్పే తరుణం వచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement