Thursday, May 16, 2024

YCP: కాపుల పరువు తీసేలా పవన్ ప్రవర్తన.. మంత్రి కొట్టు

కాపుల పరువు తీసేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవర్తన ఉందని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏలూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ… కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబాన్ని ఎంత హింస పెట్టారో తెలీదా ? అని అన్నారు. పవన్ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కాపుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. రాష్ట్ర పరిధిలో లేని కాపు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇవ్వలేను.. కాపు సామాజిక వర్గానికి మేలు కలిగేలా చేస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. రాజకీయ లబ్దికోసమే వైఎస్ వివేకా హత్యపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా పవన్ ను ప్రజలు నమ్మరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement