Wednesday, May 1, 2024

AP: 65వేల ఓట్ల మెజార్టీతో ప‌వ‌న్ గెలుపు.. భ‌విష్య‌వాణి వినిపించిన ఎంపి రఘురామ‌కృష్ణ‌రాజు

పిఠాపురంలో జ‌న‌సేనానితో ఎంపి భేటి
ప‌వ‌న్ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేరు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, జగన్ వచ్చి కూర్చున్నా.. పిఠాపురంలో పవన్ కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇవాళ‌ పిఠాపురంలో జనసేనానిని ఆయ‌న కలిశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌ను మాట్లాడుతూ… ఇది మర్యాదపూర్వక భేటీ అని వెల్లడించారు. అరాచకశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఇక… పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ్నించి పోటీ చేసినా పవన్ ప్రచారం చేస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement