Monday, April 29, 2024

హస్తినలో పవన్ కల్యాణ్ – మోడీ,అమిత్ షాలతో భేటి?

ఢిల్లీ – జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు.. బిజెపి అధినాయకత్వం నుంచి పిలుపురావడంతో ఆయన గత రాత్రి ఉదయపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.. ఈ నెల ఒకటో తేదిన పవన్ కుటుంబంతో సహా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో సన్నిహితుల వేడకలో పాల్గొనేందుకు వెళ్లారు.. అక్కడ ఉన్నప్పుడే ఫోన్ రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు.. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో పవన్ ను బిజిపి అగ్రనాయకత్వం పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.. నేడు పవన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటి కానున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement