Thursday, April 18, 2024

‌ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ : పరీక్షలు సోమవారం ప్రశాంతంగాప్రారంభమైనాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు ఉండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 9 గంటల లోపే చేరుకున్నారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 వెలమండికి పై గా పరీక్షలకు హాజరైనారు.

ఉమ్మడి మెదక్ : ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో 271 పరీక్ష పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో 46,306 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉద‌యం 8 గంట‌ల నుంచే విద్యార్థులు ప‌రీక్ష కేంద్రాల‌కు చేరుకున్నారు. కేంద్రాల ఆవ‌ర‌ణ‌లో అంటించిన త‌మ హాట్ టికెట్ నెంబ‌ర్ ను ప‌రిశీలించుకుని త‌మ‌కు కేటాయించిన రూమ్ కు వెళ్లి ప‌రీక్ష రాస్తున్నారు. విద్యార్థుల‌కు ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద అన్ని వ‌స‌తులు క‌ల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement