Thursday, May 2, 2024

Pawan Kalyan: నేడు నంద్యాలకు జనసేనాని.. కౌలు రైతులకు భరోసా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు నంద్యాలలో పర్యటించనున్నారు. శిరివెళ్ల గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందజేయనున్నారు. శిరివెళ్ళ మండలంలో ఆత్మహత్య చేసుకున్న 130 మంది రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి , వారికీ ఆర్ధిక సాయం అందజేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.

పవన్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉదయం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి బయల్దేరి నంద్యాల జిల్లా శిరివెళ్ల గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరి వెళ్తారు. మార్గమధ్యలో.. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులకు చెందిన నాలుగు కుటుంబాలను పరామర్శించి.. వారికి సాయం డబ్బును చెక్కుల ద్వారా అందజేస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు శిరివెళ్ల చేరుకుని.. రచ్చబండ కార్యక్రమంలో కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందజేసి సభలో ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement