Sunday, April 28, 2024

AP: ప‌వ‌న్ కు జ్వ‌రం… వారాహి యాత్ర‌కు బ్రేక్…

అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈరోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరమ‌ని వైద్యులు తెలిపారు. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు..

జ‌న‌సేనాని నాలుగు రోజులుగా పిఠాపురంలో వరుస పర్యటనలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకమ‌య్యారు. ఈ పర్యటనలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనారోగ్యానికి గుర‌య్యారు. పిఠాపురంలోనే పవన్ కు వైరల్ ఫీవర్ వ‌చ్చింది. అయినా సరే షెడ్యూల్ ప్రకారం పర్యటనలో ప‌వ‌న్ పాల్గొన్నారు. నిన్న పిఠాపురం నియోజకవర్గంలోని మండలాల్లో గడపగడపకు పవన్ కళ్యాణ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దీంతో మరలా పవన్ కు తీవ్ర జ్వరం వ‌చ్చింది. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు బ్రేక్ ప‌డింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని జనసేన అధిష్టానం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement