Wednesday, May 15, 2024

Palasamudram – ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాలే ప్ర‌జా సేవ‌కులు – మోడీ

పాల‌స‌ముద్రం – ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాలే ప్ర‌జా సేవ‌కులని అభివ‌ర్ణించారు ప్ర‌ధాని మోడీ.. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ 900కోట్ల‌తో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించిన‌ నాసిన్ క్యాంప‌స్ ని ప్రధాని నేటి సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా ప్ర‌ధాని అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోడీ ముఖాముఖిగా మాట్లాడారు..

అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో మోడీ ప్ర‌సంగిస్తూ,. చారిత్రక ప్రదేశంలో నాసిన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. నాసిన్‌ను ప్రారంభించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. పుట్టపర్తి సత్యసాయిబాబ జన్మస్థలం.. లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని తెలిపారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారని అన్నారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని.. జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామన్నారు ప్రధాని. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలని.. ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని తెలిపారు.

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. నాసిన్ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. మోడీ బిజీ షెడ్యూల్ లో కూడా ఏపీకి వచ్చి.. నాసిన్ భవనాలను జాతికి అంకితం చేయడం అదృష్టమని అన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం.. ప్రస్తుత ప్రభుత్వం నాసిన్ కేంద్రం ఏర్పాటుకు మంచి సహకారం అందించారని ఆర్ధిక మంత్రి ప్ర‌శంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement