వి.కోట లో దారుణ హత్య జరిగింది. వీకోట పట్టణం భారత్ నగర్ కట్ట కాలువపై ఇంట్లో అద్దెకు ఉన్నవారు గొడవ పడుతుండగా మందలించాడని ఇంటి యజమాని సాంబశివ పిళ్ళై (42) పై నారాయణ నగర్ కు చెంది బసవరాజ్ కత్తితో విచక్షణారహితంగా పోవడంతో మృతి చెందాడు.
సాంబశివ ఇంట్లో కాంచనమ్మ అద్దెకు ఉంటుంది . ఆమెకు వరసకు సోదరుడైన బసవరాజ్ వచ్చి ఆమెతో గొడవ పడుతున్నాడు. గమనించిన ఇంటి యజమాని సాంబశివ ఎందుకు గొడవ పడుతున్నారని మందలించడంతో అకస్మాత్తుగా అతనిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతనిని కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో అంబులెన్స్ ద్వారా కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాగి గొడవ చేస్తున్న వ్యక్తిని మందలించాడని ఇంటి యజమాని హత్య చేసిన ఘటన వీకోట లో కలకలం రేపింది.