Tuesday, April 30, 2024

Inner Ring Road Case – రెండో రోజూ సిఐడి విచార‌ణ‌కు హాజ‌రైన నారా లోకేష్

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వరుసగా రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. కాగా, తొలిరోజు (మంగళవారం) ఆరున్నర గంటలపాటు సాగిన విచారణలో మొత్తం 50 ప్రశ్నలు అడిగారని.. వాటిలో 49 ప్రశ్నలు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో సంబంధం లేనివేనని లోకేశ్‌ వెల్లడించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని అంశాలపై సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement