Friday, May 3, 2024

ఏపీలో విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు

ఏపీలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. జగనన్న విద్యా కానుక పథకం కింద 23.59 లక్షల మంది విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తెలిపారు. ప్రైవేటు విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాణించాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని వివరించారు. జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కావాల్సినవన్నీ ఇస్తున్నారని వెల్లడించారు. 4 డిక్షనరీలను బాబు, లోకేశం, అచ్చెన్న, ఉమలకు కూడా అందజేయాలని విద్యాశాఖ అధికారులకు నా విన్నపం అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement