Sunday, May 5, 2024

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వులు.. త్వరలో కొత్త నోటిఫికేషన్‌

అమరావతి,ఆంధ్రప్రభ: 2018లో వివిధ వర్శిటీల్లో రిక్రూట్‌ అయిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లందరినీ తొలగించి కొత్తగా నిబంధనల మేరుకు నోటిఫికేషన్‌ ద్వారా రిక్రూట్‌మెంట్‌ చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి 2018లో రిక్రూట్‌ అయిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అందరినీ విధుల నుండి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి నిబంధనలకు అనుగుణంగా రిక్రూట్‌మెంట్‌ చేస్తామని ప్రకటించింది. తొలగించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల వివరాలన్నీంటినీ భద్రపరుస్తామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement