Sunday, April 28, 2024

Breaking: పెన్షన్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం.. సీఎం జగన్

పెన్షన్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పెన్షన్లపై ఆడిట్ జరుగుతుంటే తొలగిస్తున్నామని ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతి ఆరు నెలలకు ఆడిట్ అనర్హులకు నోటీసులిచ్చి వెరిఫికేషన్ మాత్రమే చేస్తామన్నారు. నోటీసులు ఇచ్చినంత మాత్రానా పెన్షన్ తీసేయరన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement