Wednesday, April 24, 2024

విద్యుత్ తీగ తెగిపడి బస్ డ్రైవర్ మృతి

విద్యుత్ తీగ తెగిప‌డి బ‌స్ డ్రైవ‌ర్ మృతి చెందిన ఘ‌ట‌న భీమారం మండలంలోని కొత్తపెల్లి శివారులో చోటుచేసుకుంది. చెన్నూర్ మండలం కమ్మరిపల్లి గ్రామానికి చెందిన దుంపటి మల్లయ్య (48) భీమారం మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ గ్రామర్ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ గా చేస్తున్నాడు. అయితే రోజువారీగానే మంగళవారం ఉదయం బడి పిల్లలను వారి ఇళ్లలో దించేసి సాయంత్రం ఏలికేశ్వరం గ్రామ పంచాయతీ ఎల్బి పేట్ గ్రామంలో బస్ ను నిలిపివేశాడు. త‌న ఇంటికి న‌డుచుకుంటూ వెళుతున్న క్రమంలో ఎల్టి లైన్ విద్యుత్ తీగ తెగి మీద పడడంతో దుంపటి మల్లయ్య మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement