Monday, April 29, 2024

Ongole …స్వంత బొమ్మ‌తో ఎవ‌రూ గెల‌వ‌లేరు…వైఎస్ఆర్, జ‌గ‌న్ క‌టౌట్ ఉంటేనే విజ‌యం … మంత్రి ఆదిమూల‌పు

ఒంగోలు – ప్రకాశం జిల్లాలో మార్పులపై విజయసాయిరెడ్డి, బాలినేని కసరత్తు చేస్తున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు.. ఒంగోలులో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, కొండెపిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయ‌ని, గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో కొండెపి ఒక్క చోటే వైసీపీ ఓటమి పాలైంది అని ఆయన చెప్పారు. ఈసారి కొండెపిలో వైసీపీ జెండా ఎగరేయటం ఖాయం అయింద‌న్నారు… 175 నియోజకవర్గాల్లో ఎవరైనా సరే సీఎం జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మలతో గెలవాల్సిందే అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం ఎందుకు మారార‌ని,. ఎన్టీఆర్, బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలి అని మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.

పార్టీలో మార్పుల సహజం అలాంటి వాటిపై టీడీపీ అనవసరమై రాద్ధంతం చేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీ 175 స్థానాల్లో విజయం సాధించాలంటే తప్పకుండా తగిన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయ‌న్నారు.. మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ ఇలా చేస్తున్నారని సురేష్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement