Monday, April 29, 2024

One District – One Product .. కేంద్రం నుంచి ఎపికి ఆరు అవార్డులు… అభినందించిన జ‌గ‌న్

తాడేప‌ల్లి – ఒక జిల్లా ఒక ఉత్పత్తి లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులను సీఎం జగన్‌ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌-ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు రావడం గమనార్హం. ఉప్పాడ జామ్దాని చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు రాగా.. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్‌ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు లభించాయి.

సామాజిక, ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం – వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అధికారులు అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులు కలిశారు. వారిని సీఎం జగన్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement