Thursday, May 2, 2024

ఎన్టీఆర్ జిల్లాలో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లిలో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసిన ఘటన కలకలం రేపింది. టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల మధ్య లంకెబిందెలు ఉన్నాయని క్షుద్రపూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుప్తనిధుల కోసం వచ్చిన వ్యక్తుల వెంట చిన్న బాలుడు ఉన్నాడు. దీంతో నరబలి ఇవ్వడానికే బాలుడిని తెచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

గుప్తనిధుల కోసం వచ్చిన 8 మందిలో నలుగురు పరారయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వెంట బాలుడు ఉండటంతో.. నరబలి ఇవ్వడానికి తీసుకొచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి (బుగ్గపాడు) పుజారితో పాటు తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి చెందిన వారిగా గుర్తించారు. నిందితులు వచ్చిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement