Sunday, May 5, 2024

100 రూపాయల కాయిన్‌పై ఎన్టీఆర్ బొమ్మ.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన రిజర్వ్​ బ్యాంక్​

తెలుగు ప్రజలందరికీ ఇది గుడ్ న్యూస్. ఏపీ మాజీ సీఎం, దివంగత మహానేత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంతోషకరమైన వార్త ​ చెప్పింది. తెలుగు ప్రజలు యుగ పురుషుడుగా పిలుచుకునే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్‌బీఐ అంగీకరించింది. ఈ విషయాన్ని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి తిరుపతిలో వెల్లడించారు.

ఆర్బీఐ నిర్ణయంతో త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న నాణెం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక.. వంద రూపాయల నాణెంపై అన్నగారి బొమ్మ ముద్రించడంపై సంతోషం వ్యక్తం చేసిన పురంధేశ్వరి.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement