Sunday, April 28, 2024

Minister Peddireddy : ఇప్పుడు అధికారంలో ఉన్నాం… రేపు ఉంటాం..

తిరుప‌తి – మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. రేపు కూడా అధికారంలోకి రాబోతున్నాం అని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ… ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయ‌ని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కలిసిమెలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాల‌న్నారు.మళ్లీ ముఖ్యమంత్రిగా జ‌గ‌న్ ను చేసేందుకు ప్ర‌తిఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు.

ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాల‌ని, దీనికోసం అందరూ కష్టపడి పనిచేయాల‌ని పిలుపు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థులంతా విజయం సాధించేలా పనిచేయాలని కోరారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, మళ్లీ ఓటు అడిగే విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేశార‌ని గుర్తు చేశారు పెద్దిరెడ్డి. ఇప్పుడు అభ్యర్థులు ఖరారయ్యారని అంటూ.. అందరినీ కలుపుకొని నేతలు ముందుకు పోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement