Sunday, May 19, 2024

టెన్షన్ వద్దు.. వచ్చే జనవరి దాకా చాన్స్ ఉంది: పెన్షనర్ల సంఘం

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): తెలంగాణలో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లైఫ్‌ సర్టిఫికెట్లు సమర్పించేందుకు అవకాశం ఉందని, ఈ విష యంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని హైదరాబాద్‌లోని ఏపీ పెన్షనర్ల సంఘం జనరల్‌ సెక్రటరీ టి.ఎం. బి.బుచ్చిరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

2014 మే 2 తరువాత పదవీ విరమణ పొందినవారికి ఈ వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అలాగే పెన్షనర్లకు లబ్దికలిగేలా పీఆర్‌సీ ప్రకటించాలని కోరామని తెలిపారు. సాధారణంగా నవంబర్‌లో పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్లను సమర్పిస్తూంటారని, అయితే ఈసారి ఏపీ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించిందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement