ప్రతి అంశాన్ని అధికారులు ఫైళ్లలో రాస్తే కోర్టుకు వెళ్లే అవసరమే రాదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించడం తెలిసిందే. దీనిపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. మౌఖిక ఆదేశాలు జారీ చేసేటప్పుడే అధికారులు వాటి పర్యవసనాలు ఏంటన్నదానిపైనా ఆలోచించుకోవాలని హితవు పలికారు. పాఠశాల ఆవరణలో ఇతర భవనాలు ఉండొద్దని కోర్టు చెప్పిందని, అయినా భవన నిర్మాణాలు జరగడంతో కోర్టు ధిక్కరణగా పరిగణించిందని లక్ష్మీనారాయణ వివరించారు. ఉన్నతాధికారులు ఇలా శిక్షకు గురికావడం వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. ఆయా సంఘాలు కూర్చుని ఇటువంటి అంశాలపై చర్చించుకోవాలని సూచించారు.
ప్రతి అంశాన్ని ఫైళ్లలో రాస్తే కోర్టుకెళ్లే అవసరమే ఉండదు : సీబీఐ మాజీ జేడీ
Advertisement
తాజా వార్తలు
Advertisement