Saturday, May 4, 2024

AP: హోం మంత్రి సుచ‌రిత‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన నూత‌న డీజీపీ

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హోంశాఖ‌ మంత్రి మేకతోటి సుచరితను నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి ఇవ్వాల సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా బ్రాడీపేటలోని హోంమంత్రి క్యాంప్ ఆఫీసులో హోం మినిస్టర్ సుచరితను కలిసి పుష్పగుచ్ఛం అంద‌జేశారు. నూతనంగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజేంద్రనాద్ రెడ్డిని హోం మినిస్టర్ సుచరిత, ఆమె భర్త ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అంశాల గురించి హోంమంత్రి సుచరితతో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి చ‌ర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement