Saturday, April 20, 2024

ప్రాణం తీసిన చేపలవేట.. క‌రెంట్ తీగ త‌గిలి అక్క‌డిక‌క్క‌డే మృతి..

గణపురం (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన బండి పోశాలు (20) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై చ‌నిపోయాడు. చెల్పూర్ కు చెందిన బండి పోశాలు అదే గ్రామానికి చెందిన రావుల రవి, శీలం దేవేందర్ తో కలిసి చెల్పూర్ శివారులోని మలహాల్ రావు మడుగులో చాపలు ప‌ట్టేందుకు వెళ్లాడు. అయితే బండి పోశాలు చాపలు ప‌ట్టేందుకు ప‌క్క‌నే ఉన్న క‌రెంటు తీగల నుండి వైరు తీసుకున్నాడు. దాని ద్వారా చేప‌లు ప‌డుతుండ‌గా ప్రమాద వశాత్తు వైరు క‌ట్ అయి కరంటు షాక్ తగిలి అక్కడికి అక్కడే చ‌నిపోయాడ‌ని మృతుని తండ్రి ఓదెలు తెలిపారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్ ఐ ఉద‌య్‌కిర‌ణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement