Friday, May 3, 2024

నెల్లూరులో ట్రాక్టర్ బోల్తా… ఒకరు మృతి

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు గమేసా ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ట్రాక్టర్ లో ఉన్న వ్యక్తి మృతిచెంద‌గా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం అయ్యపురాజుపాలెం వ్యక్తిగా గుర్తించారు. చిలకడ దుంపలు అమ్ముకొని స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. కొడ‌వ‌లూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement