Tuesday, April 30, 2024

సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సీఎం జ‌గ‌న్

సంగం బ్యారేజ్‌కు మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి బ్యారేజీ పేరు పెడ‌తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో దివంగ‌త మంత్రి గౌతమ్‌రెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గౌతమ్‌రెడ్డికి నివాళులర్పించారు. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ… త‌న ప్ర‌తి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడుగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌ను ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ప్రోత్స‌హించేవార‌ని తెలిపారు. ఆయ‌న‌ను తానే రాజ‌కీయాల్లోకి తీసుకు వ‌చ్చాన‌ని చెప్పారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌లో ఆరు విభాగాలను గౌత‌మ్‌రెడ్డి చూసేవార‌ని ఆయ‌న తెలిపారు. ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావాల‌ని గౌత‌మ్‌రెడ్డి త‌ప‌న ప‌డేవార‌ని, ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తేనే యువ‌త‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అనేవారని జ‌గ‌న్ చెప్పారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాన‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement