Friday, April 26, 2024

నెల్లూరు జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం గంజాయిని అక్రమరవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఢిల్లీకి కార్లలో గంజాయి తరలించి.. అక్కడి నుంచి మద్యం ఇక్కడికి తీసుకువచ్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. రెండు కార్లను ఆపి కందుకూరు పోలీసులు త‌నిఖీలు చేయగా.. నిందితులు కార్లు వదిలి పారిపోయారు. అనంతరం పోలీసులు మాటువేసి చాకచక్యంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement