Thursday, May 2, 2024

Navasakam – మీ సంక్షేమం కోసమే టీడీపీ, జనసేన కలయిక – నాదెండ్ల మనోహర్‌

నెల్లిమర్ల ,- రాష్ట్ర ప్రజల కోసమే టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం – నవశకం’ పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది…ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ..

”సెప్టెంబరు 13న రాజమహేంద్రవరంలో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాష్ట్ర భవిష్యత్తు మారాలనే దిశగా పవన్‌ అడుగులు వేశారు. మంచి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపా పాలనలో అనేక అవమానాలు, వేధింపులకు గురయ్యాం. అవినీతి ప్రభుత్వం ప్రజలకు నిరాశమిగిల్చింది. జగన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఎంత నష్టం జరిగిందో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. జగన్‌ అరాచక పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పవన్‌ నాయకత్వం తోడై రాష్ట్రప్రజలకు మంచి జరుగుతుంది” అని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement