Sunday, May 5, 2024

Arjun Awards – ష‌మీతో స‌హా 26 మందికి అర్జున్ అవార్డులు … బ్యాడ్మింట‌న్ జోడి సాత్విక్, చిరాగ్ శెట్టి జోడికి ఖేల్ ర‌త్న పురస్కారం

న్యూఢిల్లీ – క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. సీనియర్‌ క్రికెటర్ మహ్మద్ షమీ, పారా ఆర్చర్ శీతల్ దేవి సహా మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకున్నారు. కాగా ఈ ఏడాది మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుతో సత్కరించాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

షమీతో పాటు అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి కూడా అర్జున అవార్డు ఇవ్వనున్నారు. కబడ్డీ, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ సహా వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన ఆటగాళ్లు కూడా జాతీయ క్రీడా అవార్డులకు ఎంపికయ్యారు. వీరే కాకుండా వివిధ క్రీడలకు చెందిన 5 మంది కోచ్‌లను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ముగ్గురు అనుభవజ్ఞులకు ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలందరికీ 2024న 9 జనవరి రాష్ట్రపతి భవన్‌లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

జాతీయ క్రీడా పురస్కారాల విజేతలు..

మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న..
చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్).

- Advertisement -

అర్జున అవార్డులు:
ఓజాస్ ప్రవీణ్ డియోటాలే (ఆర్చరీ)
అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ)
మురళీ శ్రీశంకర్ (అథ్లెటిక్స్)
పారుల్ చౌదరి (అథ్లెటిక్స్),
మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్),
ఆర్ వైశాలి (చెస్),
మహ్మద్ షమీ (క్రికెట్),
అనుష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్),
దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్),
దీక్షా దాగర్ (గోల్ఫ్),
క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ),
​​సుశీల చాను (హాకీ), ​​
పవన్ కుమార్ (కబడ్డీ),
రీతు నేగి (కబడ్డీ),
నస్రీన్ (ఖోఖో),
పింకీ (లాన్ బౌల్స్),
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్),
ఈషా సింగ్ (షూటింగ్),
హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్),
ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్),
సునీల్ కుమార్ (రెజ్లింగ్),
ఆంటిమ్ (రెజ్లింగ్),
నౌరెమ్ రోషిబినా దేవి ( ఉషు),
శీతల్ దేవి (పారా ఆర్చరీ),
ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్),
ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్).

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ):
లలిత్ కుమార్ (రెజ్లింగ్),
ఆర్‌బీ రమేష్ (చెస్),
మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్),
శివేంద్ర సింగ్ (హాకీ), ​​
గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లాఖాంబ్).

ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ):
జస్కిరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్)
భాస్కరన్ ఇ (కబడ్డీ),
జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్).

ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం:
మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్)
వినీత్ కుమార్ శర్మ (హాకీ) ​​
కవిత సెల్వరాజ్ (కబడ్డీ)

Advertisement

తాజా వార్తలు

Advertisement