Thursday, May 2, 2024

Nara Lokesh : 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యువగళం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పాదయాత్ర 153వ రోజున 50శాతం లక్ష్యానికి చేరుకుంది. అయితే యువగళం పాదయాత్ర సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా #2000kmOfYuvaGalam అనే యాష్ టాగ్ తో 3వ స్థానంలో ట్రెండ్ అవుతుంది.

ప్రజాగళంగా, ప్రజాబలంగా మొదలైన యువనేత నారా లోకేష్ పాదయాత్ర నేడు 2000 కి. మీ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా #2000kmsOfYuvaGalam అనే యాష్ టాగ్ తో వేల సంఖ్యలో ట్వీట్స్ వేస్తూ యువనేత పాదయాత్ర కి నెటిజన్లు సంఘీభావం తెలుపుతున్నారు. యువనేత లోకేష్ దృడ సంకల్పానికి నెటిజన్లు జై కొడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement