Friday, May 3, 2024

ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని సీఎం జగన్ కు లేఖ రాసిన లోకేశ్..

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను వెంటనే ఆదుకోవాలని కోరుతు సీఎం జగన్ కి లేఖ రాశారు నారా లోకేష్. కరోనా సంక్షోభం కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడడంతో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా తయారైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కరోనా రెండు దశల్లోనూ తీవ్ర నష్టం మిగిల్చిందని, తద్వారా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని వెల్లడించారు. పాఠశాలల పునఃప్రారంభం నాడే కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఒక ప్రైవేటు పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.

గత ఐదు నెలలుగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని లోకేశ్ వివరించారు. బోధనా వృత్తిలో జీతాలు రాక ఉపాధ్యాయులు కూరగాయల విక్రయం, భవన నిర్మాణ కార్మికులుగా కూలి పనికి వెళ్లడం, వ్యవసాయ కూలీలుగా మారడం వంటి విషాద గాథలు ఎన్నింటినో మీడియాలో చూస్తున్నామని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేలు ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం అందించిందని లోకేశ్ వెల్లడించారు. అటు కర్ణాటక సర్కారు నెలకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించిందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటు ఉపాధ్యాయుల జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి అని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రేవంత్‌ను 300 కి.మీ. లోతుకు తొక్కుతాం: జీవన్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement