Monday, April 29, 2024

AP : శ్రీ‌వారి సేవ‌లో నారా లోకేష్‌ కుటుంబం…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుటుంబసభ్యుల‌తో క‌ల‌సి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్‌ జన్మదినం సందర్భంగా లోకేశ్‌- బ్రాహ్మణి దంపతులు, నారా భువనేశ్వరి స్వామివారి దర్శనానికి వచ్చారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.

దేవాన్ష్‌ పుట్టినరోజును పురస్కరించుకుని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు కుటుంబసభ్యులు అన్నదానం చేయనున్నారు. శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షలను తితిదే అన్నప్రసాదం ట్రస్ట్‌కు లోకేశ్‌ విరాళమిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement