Sunday, April 28, 2024

AP : కడప నేతలతో ఇవాళ షర్మిల భేటీ

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ కడప నేతలతో భేటీ కానున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జర‌గ‌నుంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.

కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కడప పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement