Sunday, May 5, 2024

NTR Trust: వరద బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి సాయం

ఇటీవల ఏపీలో సంభంవించిన వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఆర్థిక సాయం అందించారు. చిత్తూరు, కడప, నెల్లూరు వరదల్లో మృతిచెందిన 48 మంది వరద బాధిత కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సాయాన్ని సోమవారం అందించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన జీవితంతో, చర్యలతో మార్గదర్శి అయ్యారని అన్నారు. సమాజానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జీవితాన్ని అంకితం చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement