Sunday, April 28, 2024

Nagari టిక్కెట్ నాదే …. తేల్చేసిన రోజా..

తిరుమల (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం టికెట్ మరొకరికి కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా దర్శించుకున్నారు . ఆ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ తాను నగరి నుంచి పోటీ చేయాలో వద్దో అనేది తమ పార్టీ అధిష్టానానికి చూసుకుంటుందని అన్నారు. తనకు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పక్కా అని చెప్పుకొచ్చారు..

తాను జగనన్న సైనికురాలినని, జగనన్న కోసం ప్రాణమైనా ఇస్తానన్నారు. తానూ ఏమిటో ఎం చేస్తున్నానో నగరి ప్రాంత పార్టీ కార్యకర్తలు, నాయకులకు తెలుసు నగిరి టికెట్ తనకేనని వాళ్ళు నమ్ముతున్నారని అందుకేఆ విషయంలో వాళ్ళు ధీమాగా ఉన్నారన్నారు . అయినా టికెట్ ఇవ్వకపోతే అనే ప్రశ్నకు బదులిస్తూ తనకు టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకోసం కృషి చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేశారు సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఎంత అభిమానం ఉందో అంతకు రెట్టింపు అభిమానం ఎమ్మెల్యేలలో ఉందన్నారు రోజా.
జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన వెంట ఉన్నామని, జగన్ సీఎం కావాలని పనిచేసే వాళ్ళమన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అని సర్వేలు తేలుస్తాయన్నారు రోజా. టికెట్ రానివారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు.
శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం బాగు ఉండాలి. జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని ప్రార్థించాననని తెలిపిన రోజా.. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేక పక్క పార్టీ లోని వారి కోసం ఎదురు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు ఒకచోట నిలుచునే దమ్ము లేదన్న రోజా.. రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల పోటీ చేయాలని సర్వేలు చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టే 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆమెతో పాటు తిరుమలేశుని దర్శించుకున్న వారిలో ప్రముఖ సినీ గాయకుడు మనో దంపతులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement